హోంమంత్రి అమిత్షాకు ఘన స్వాగతం
ABN , First Publish Date - 2022-07-03T05:19:09+05:30 IST
హోంమంత్రి అమిత్షాకు ఘన స్వాగతం
- స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
- బీజేపీ జాతీయ కార్యవర్గ సభలకు వచ్చిన కర్ణాటక, హర్యానా, ఉత్తరాఖండ్ సీఎంలు
- మరో 40 మంది ముఖ్యనేతల ఆగమనం
శంషాబాద్ రూరల్, జూలై 2: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా నగరానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆయనకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమిత్ షా మధ్యాహ్నం 2గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. హౌస్ టెర్మినల్ వీఐపీ గేటు నుంచి బయల్దేరి నగరానికి వెళ్లారు. ఆయనరాక కోసం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కర్ణాటక, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సీఎంలు బస్వరాజ్ బొమ్మై, మనోహర్లాల్ కట్టర్, పుష్కర్సింగ్ ధామి, కేంద్ర మంత్రులు పుయూష్ గోయల్, అశ్విన్కుమార్ వైష్ణవ్, స్మృతి ఇరానీ, మొనాకీ లేఖీ, అరుణ్ రామ్, శర్వానంద్, అనురాగ్ ఠాగూర్, కార్మిక శాఖ మంత్రి భూపేందర్యాదవ్, ఫగన్సింగ్, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుఖంత్ మజుదర్, గుజరాత్ ఎంపీ చంద్రకాంత్ పాటిల్, గోవా డిప్యుటీ సీఎం చంద్రకంటి కల్వేకర్, హర్యానా బీజేపీ అధ్యక్షుడు ఓంప్రకాష్ ధన్కర్, హర్యానా క్రీడలశాఖ మంత్రి సందీ్పసింగ్, యూపీ ఎంపీ అనిల్జైన్, ఉత్తరఖండ్ బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నీలం కట్టిల్, ఛత్తీ్సఘడ్ అధ్యక్షుడు పవన్సాయి, కర్ణాటక మంత్రి ప్రభుచౌహాన్, వెస్ట్బెంగాల్ ఎంపీ దినేష్ త్రివేది, కర్ణాటక ఎంపీ మునుస్వామి, బీహార్ మంత్రి షానవాజ్ హుస్సేన్, ఎంపీలు పంకజ్ముండే, ఎంపీ బసంత్కుమార్ తదితరులు శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకొని అక్కడి నుంచి నగరానికి తరలివెళ్లారు. వారికి విమానాశ్రయంలో బీజేపీ నేతలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, డిప్యూటీ సీఎంలు, రాష్ట్రాల అధ్యక్షులు దాదాపు 40 మంది వరకు తరలివచ్చారు. మూడు రోజులుగా బీజేపీ నేతల ఆగమనాలతో శంషాబాద్ విమానాశ్రయంలో సందడి నెలకొంది.