ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత దారుణమా.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2020-11-28T01:34:58+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వాసుపత్రికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ...
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వాసుపత్రికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రులు ఇంత దారుణంగా ఉంటాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిద్రపోతున్న రోగులను, మార్చురీ గదుల్లో శవాలను ఎలుకలు పీక్కుతినడం ప్రభుత్వాసుపత్రుల్లో అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. కానీ యూపీలోని సాంభాయ్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పట్టపగలు స్ట్రెచర్పై ఉన్న ఓ యువతి మృతదేహాన్ని కుక్క పీక్కుతింటోంది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
అయితే ఈ దారుణానికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆసుపత్రి ఉన్నతాధికారులు.. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకున్నామని, ఓ వార్డు బాయ్ని, స్వీపర్ను సస్పెండ్ చేశామని తెలియజేశారు. తదుపరి విచారణ కూడా కొనసాగుతోందని వెల్లడించారు.