విద్యుదాఘాతంతో రెండేళ్ల బాలుడు మృతి
ABN , First Publish Date - 2022-05-23T06:11:12+05:30 IST
శ్రీకృష్ణాపురంలో విద్యుదాఘాతానికి గురై రెండేళ్ల బాలుడు మృతి చెందాడు.
ఆరిలోవ, మే22: శ్రీకృష్ణాపురంలో విద్యుదాఘాతానికి గురై రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గగన్ (2) అనే బాలుడు ఇంటి వరాండాలో తన అన్నయ్యతో ఆడుకుంటూ తనకు లభించిన మేకును స్విచ్ బోర్డులో పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆ సమయంలో బాలుడి తల్లి గుబ్బల నాగరాణి ఇంట్లో పనులు చేసుకుంటోంది. అప్పటివరకు కళ్లెదుట వున్న బాలుడు అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై పోలీసులకు ఎటువంటి సమచారం అందలేదు.