మురిసిన మువ్వన్నెల జెండా
ABN , First Publish Date - 2022-08-15T05:58:30+05:30 IST
మండలంలోని కొండకర్ల ఆవలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంతిన భక్తసాయిరాం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
అచ్యుతాపురం రూరల్, ఆగస్టు 14 : మండలంలోని కొండకర్ల ఆవలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంతిన భక్తసాయిరాం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కొండకర్ల ఆవలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వదేశీ మత్స్యకార సంక్షేమ సంఘం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బోట్లను స్వస్తిక్ ఆకారంలో ఏర్పాటు చేసి, జాతీయ జెండాలను చేతపట్టి ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార రైతులు మల్లి రమణ అప్పారావు, నాగల అచ్చయ్యనాయుడు, పిల్లి గోవింద్, కక్కల అప్పారావు, పితాని బుజ్జి, ప్రశాంతి విద్యా సంస్థల ఎన్సీసీ కెడేట్లు, ఎన్సీసీ అధికారి సిహెచ్.మణికంఠ తదితరులు పాల్గొన్నారు.