జాతీయ పార్టీతో మలుపు

ABN , First Publish Date - 2022-10-05T04:22:10+05:30 IST

సీఎం కేసీఆర్‌ బుధ వారం ప్రకటించే జాతీయ పార్టీతో దేశ రాజకీ యాలు మలుపు తిరగనున్నాయని పీఏసీ సభ్యుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌ జోస్యం చెప్పారు.

జాతీయ పార్టీతో మలుపు
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న జైపాల్‌యాదవ్‌

- సీఎం కేసీఆర్‌ పార్టీ ప్రకటించగానే సంఘీభావంగా బాణసంచా పేల్చాలి

- పీఏసీ సభ్యుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌


కల్వకుర్తి, అక్టోబరు 4: సీఎం కేసీఆర్‌ బుధ వారం ప్రకటించే జాతీయ పార్టీతో దేశ రాజకీ యాలు మలుపు తిరగనున్నాయని పీఏసీ సభ్యుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌ జోస్యం చెప్పారు. కల్వకుర్తి పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జైపాల్‌ యాదవ్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో సీఎం కేసీఆర్‌ బుధవారం మధ్యాహ్నం జాతీయ పార్టీ ప్రకటించగానే కల్వకుర్తి నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంఘీభావంగా మండలాల్లో, గ్రా మాల్లో బాణసంచా పేల్చాలని కోరారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలను దేశంలోని పేద ప్రజలందరికీ అందించడమే టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ల క్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. దేశంలోని అన్నివర్గాలు కేసీఆర్‌ ఏర్పా టుచేసే జాతీయ పార్టీని స్వాగతిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-05T04:22:10+05:30 IST