గుర్తించారు.. సత్కరించారు!
ABN , First Publish Date - 2022-08-10T05:08:21+05:30 IST
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా గుమ్మలక్ష్మీపురానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు బొంది రాములు కుటుంబాన్ని మంగళవారం అధికారులు సత్కరించారు.
స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబానికి సన్మానం
గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 9 : ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా గుమ్మలక్ష్మీపురానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు బొంది రాములు కుటుంబాన్ని మంగళవారం అధికారులు సత్కరించారు. 1935-45 మధ్య కాలంలో ఉప్పు సత్యాగ్రహం, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో బండి రాములు పాల్గొన్నట్లు వారు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పోరాట వీరుడిని స్మరిస్తూ.. ఆయన మనవడు మురళి, సులోచన దంపతులను సత్కరించినట్లు చెప్పారు. మండల ప్రత్యేకాధికారి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ అప్పారావు, ఎంపీడీవో కార్యాలయ అధికారులు, సర్పంచ్ బి.గౌరీశంకరరావు, మండల ఉపాధ్యక్షుడు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.