జైలును చూసొద్దామా!

ABN , First Publish Date - 2020-02-03T20:06:52+05:30 IST

పోరాటంలో పాల్గొన్న ఎంతోమంది భారతీయులను ఇందులో బంధించింది. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌, యోగేశ్వర్‌ శుక్లా, బటుకేశ్వర్‌ దత్‌...

జైలును చూసొద్దామా!

అండమాన్‌ నికొబార్‌ దీవుల రాజధాని పోర్టుబ్లెయిర్‌లో ఉందీ సెల్యులార్‌ జైలు. బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయులను ఈ జైలులో బంధించేవారు. చనిపోయే వరకు జైలు శిక్ష అనుభవించాల్సిన ఖైదీలను బ్రిటిష్‌ ప్రభుత్వం ఇక్కడికి తరలించేది. అలా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఎంతోమంది భారతీయులను ఇందులో బంధించింది. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌, యోగేశ్వర్‌ శుక్లా, బటుకేశ్వర్‌ దత్‌ వంటి స్వాతంత్య్ర సమరయోధులు ఈ జైలులో బంధీలుగా ఉన్నారు. ఈ జైలును అండమాన్‌లో నిర్మించడానికి కారణం ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపోవడానికి అవకాశం అసలు లేకపోవడం. అందుకే బ్రిటిష్‌ పాలకులు ఇక్కడ మూడు అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఇందులో ఖైదీల కోసం ఉద్దేశించిన 696 గదులు ఉన్నాయి. బ్రిటిష్‌ పాలకులు ఇక్కడి ఖైదీలను తమ ఇళ్ల నిర్మాణ పనుల కోసం తీసుకెళ్లేవారు. ప్రస్తుతం ఈ జైలు దర్శనీయ స్థలాల్లో ఒకటి. దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఈ జైలును సందర్శించడానికి వస్తున్నారు.


Updated Date - 2020-02-03T20:06:52+05:30 IST