పక్కా ప్లాన్‌తో వచ్చిన దొంగకి మద్యం బాటిల్ దొరకడంతో...

ABN , First Publish Date - 2020-02-16T11:42:33+05:30 IST

దొంగతనానికి వచ్చి చిక్కుల్లో పడినవారిని చూసేవుంటాం. ఇటువంటి మరో ఆసక్తికర ఉదంతం ముంబైలో చోటుచేసుకుంది. ఒక ఇంటిలో దొంగతనానికి వచ్చిన వ్యక్తికి...

పక్కా ప్లాన్‌తో వచ్చిన దొంగకి మద్యం బాటిల్ దొరకడంతో...

ముంబై: దొంగతనానికి వచ్చి చిక్కుల్లో పడినవారిని చూసేవుంటాం. ఇటువంటి మరో ఆసక్తికర ఉదంతం ముంబైలో చోటుచేసుకుంది. ఒక ఇంటిలో దొంగతనానికి వచ్చిన వ్యక్తికి మద్యం బాటిల్ కనిపించడంతో అసలు సంగతి మరచిపోయాడు. వివరాల్లోకి వెళితే ఈ ఘటన ముంబైలోని మరీన్ డ్రైవ్ ప్రాంతంలో గల గిరికుంజ్ బిల్డింగ్‌లో చోటుచేసుకుంది. ఒక బిజినెస్ మ్యాన్‌కు సంబంధించిన ఫ్లాట్ లోకి ఒక దొంగ చొరబడ్డాడు. అయితే అక్కడ అతనికి మద్యం బాటిళ్లు కనిపించాయి. వాటిని చూడగానే అతని మనసు ఆగలేదు. ఒక ఉదుటన సీసాను అందుకుని, పీకల దాకా మద్యం తాగి అక్కడే పడిపోయాడు. ఆ ఇంటిలో పనిచేసే వ్యక్తి ఉదయం ఆ ఫ్లాట్‌కు వచ్చాడు. అతనికి మద్యం మత్తులో పడిపోయిన దొంగ కనిపించడంతో వెంటనే ఈ విషయాన్ని పోలీసుకులకు తెలియజేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న ఆ దొంగను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఆ దొంగ తన పేరు సంజీవ్ అని చెప్పాడు. తాను బాల్కనీలో నుంచి ఫ్లాట్‌లోకి దూరానని, మద్యం బాటిళ్లు చూడగానే తాగానని చెప్పాడు. ఆ దొంగను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-02-16T11:42:33+05:30 IST