హుస్నాబాద్లో సబ్ కోర్టును ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2022-05-27T05:14:11+05:30 IST
హుస్నాబాద్లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని గురువారం హైదరాబాద్లో హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు వినతిపత్రం సమర్పించినట్లు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని మల్లేశం, ప్రధాన కార్యదర్శి ఒగ్గోజు సదానందం తెలిపారు.
హైకోర్టు రిజిస్ట్రార్లకు వినతి
హుస్నాబాద్, మే 26: హుస్నాబాద్లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని గురువారం హైదరాబాద్లో హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు వినతిపత్రం సమర్పించినట్లు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని మల్లేశం, ప్రధాన కార్యదర్శి ఒగ్గోజు సదానందం తెలిపారు. హుస్నాబాద్లో సబ్ కోర్టు లేకపోవడం వల్ల కక్షిదారులు న్యాయపరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్నదని వారికి వివరించినట్లు చెప్పారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో కేసుల్లో ఇప్పటివరకు ఉన్న కరీంనగర్ కోర్టు కాదని సంగారెడ్డి కోర్టులో కక్షిదారులు హాజరుకావాలని ఇచ్చిన ఉత్తర్వుని కూడా సవరించి కరీంనగర్ లేదా సిద్దిపేట కోర్టులో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇందులో మంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పీ.ఆంజనేయులు, ప్రదీప్ ఉన్నారు.