‘టెట్‌’లో ఫెయిల్‌ అయిన విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-02T05:17:57+05:30 IST

టెట్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయి మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం ఉప్పరపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది.

‘టెట్‌’లో ఫెయిల్‌ అయిన విద్యార్థిని ఆత్మహత్య


దౌల్తాబాద్‌ జూలై 1: టెట్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయి మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం ఉప్పరపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కారంగుల కనకవ్వ, లచ్చయ్యకు కూతురు శిరీష(22) ఉన్నది. గొర్లకాపరి అయిన లచ్చయ్య కూతురును చదివించాడు. అయితే శుక్రవారం ఉదయం విడుదలైన టెట్‌ పరీక్షలో శిరీష ఫెయిల్‌ అయ్యింది. అప్పటి నుంచి మనస్తాపానికి గురై ఆందోళన చెందుతుండడంతో గమనించిన తల్లి కనకవ్వ ఎక్కడికి వెళ్లకుండా ఆమె వద్దనే ఉన్నది. అయితే సాయంత్రం కాసేపు బయటకు వెళ్లగానే శిరీష ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబీకులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం ఆ కుటుంబానికి సహాయం అందించాలని గ్రామస్థులు కోరారు. 

Updated Date - 2022-07-02T05:17:57+05:30 IST