చనిపోయిన మూడు నెలల తర్వాత షాకింగ్ సీన్.. సమాధిని తవ్వి ఏం తీసుకెళ్లారో తెలిస్తే..
ABN , First Publish Date - 2021-07-17T20:23:10+05:30 IST
చంఢీగఢ్లోని బిలాస్పూర్కు చెందిన ఓ ముస్లిం వ్యక్తి మూడు నెలల కిందట మరణించాడు..
చంఢీగఢ్లోని బిలాస్పూర్కు చెందిన ఓ ముస్లిం వ్యక్తి మూడు నెలల కిందట మరణించాడు.. దీంతో అతడి మృతదేహాన్ని స్మశానంలో పాతిపెట్టారు.. తాజాగా అతడి సోదరుడు ఫత్వా చదివేందుకు అక్కడకు వెళ్లి షాకైపోయాడు.. వెంటనే మత పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించాడు.. ఎవరో తన సోదరుడి మృతదేహంలోని కీలక అవయవాలను, తలపై జుట్టును తీసుకెళ్లిపోయారని ఫిర్యాదు చేశాడు.
బిలాస్పూర్లో ఈ ఘటన శుక్రవారం జరిగింది. `మృతదేహాన్ని పాతిన చోట గొయ్యి తవ్వి ఉంది. అలాగే మృతదేహాన్ని ఉంచిన పెట్టె బయట ఉంది. ఆ పెట్టెలో చూడగా మృతదేహంలోని కీలక భాగాలు లేవు. అలాగే తలపై జట్టు కూడా లేద`ని ఫిర్యాదుదారుడు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదట షాకయ్యారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.