కొలువు కోసం తండ్రిని చంపిన కొడుకు
ABN , First Publish Date - 2020-06-07T10:15:20+05:30 IST
కొలువు కోసం తండ్రిని చంపిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూర్ గ్రామంలో చోటుచేసుకుంది. హత్యకు సం బంధించిన వివరాలను
పెద్దపల్లి టౌన్, జూన్ 6: కొలువు కోసం తండ్రిని చంపిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూర్ గ్రామంలో చోటుచేసుకుంది. హత్యకు సం బంధించిన వివరాలను డీసీపీ రవీందర్ శనివారం విలేకరుల సమావేశం ఏర్పా టుచేసి వెల్లడించారు. గ్రామానికి చెందిన ముత్కల నర్సయ్య గోదావరిఖని సిం గరేణీలో పంప్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. నర్సయ్యకు భార్య తార, కొడుకు లు తిరుపతి, రాకేశ్ ఉన్నారు. పెద్ద కొడుకు తిరుపతి ఎప్పుడు డబ్బులడిగినా ఇ వ్వడం లేదని తండ్రిపై కక్ష్య పెంచుకున్నాడు.
తండ్రిని చంపితే తనకు ఉద్యో గం వస్తుందని తల్లి, తమ్ముడితో కలిసి పథకం పన్నాడు. గతనెల 25న గ్రామం లో ఓ కార్యక్రమానికి హాజరైన నర్సయ్య మద్యం సేవించి పడుకున్నాడు. ఇదే అ దనుగా భావించిన తిరుపతి తెల్లవారుజామున తండ్రి నోట్లో గుడ్డలు కుక్కి గొం తునులిమి చంపాడు. తండ్రికి గుండెపోటు ఉందని మద్యం అతిగా సేవించి మృతిచెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుపతిపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టారు. తిరుపతితో పాటు రాకేశ్ను అదుపులోకి తీసుకో గా, తార పరారీలో ఉంది. వీరి నుంచి రెండు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించి న టవల్ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చారు.