పోలీసు అమరవీరులకు ఘన నివాళి
ABN , First Publish Date - 2021-10-23T06:14:57+05:30 IST
పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా స్థానిక నాలుగో పట్టణ పోలీసుస్టేషనలో శుక్రవారం పోలీసు అమర వీరులకు ఘన నివాళి అర్పించారు.
అనంతపురం క్రైం, అక్టోబరు 22 : పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా స్థానిక నాలుగో పట్టణ పోలీసుస్టేషనలో శుక్రవారం పోలీసు అమర వీరులకు ఘన నివాళి అర్పించారు. సీఐ కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కొవిడ్ నేపథ్యంలో విధుల్లో మృతి చెందిన పోలీసు అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారి సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమ విధుల్లో మరింత బాధ్యతగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమం లో ఎస్ఐలు జమాల్బాషా, చంద్రశేఖర్, రంగయ్య, గంగాధర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
అలాగే పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా త్రీటౌన సీఐ రెడ్డెప్ప శుక్రవారం కోవిడ్ నేపథ్యంలో విధి నిర్వాహణలో మృతి చెందిన హెడ్కానిస్టేబుల్ రంగేనాయక్కు నివాళి అర్పించారు. ఆయన సిబ్బందితో కలిసి స్థానిక షీర్డీనగర్లోని వారి ఇంటికి వెళ్లి రంగేనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
చెన్నేకొత్తపల్లి: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని రామగిరి సీఐ చిన్నగౌస్, ఎస్ఐ శ్రీధర్ పేర్కొన్నారు. మండలంలోని వెల్దుర్తి గ్రామంలో శుక్రవారం రేహౌండ్ జవాన సుధాకర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కనుముక్కల, వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, జవాన కుటుంబసభ్యులు, గ్రామ స్థులు పాల్గొన్నారు.