ఎద్దుల ఈశ్వరరెడ్డికి ఘన నివాళి

ABN , First Publish Date - 2021-08-04T04:59:14+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధు డు, కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వరరెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా పలువురు ఆయనకు మంగళవా రం ఘనంగా నివాళులర్పించారు.

ఎద్దుల ఈశ్వరరెడ్డికి ఘన నివాళి
ఎద్దుల ఈశ్వరరెడ్డి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న దృశ్యం

జమ్మలమడుగు రూరల్‌, ఆగస్టు 3:  స్వాతంత్య్ర సమరయోధు డు, కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుడు  కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వరరెడ్డి 35వ వర్ధంతి  సందర్భంగా పలువురు ఆయనకు మంగళవా రం ఘనంగా నివాళులర్పించారు. గ్రంథాలయ వ్యవస్థాపకుడు ఎద్దుల విశ్వచైతన్యరెడ్డి ఆధ్వర్యంలో గ్రంథాలయ కమిటీ సభ్యు లు, సీపీఐ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ప్రసాద్‌  మాట్లాడుతూ ఎద్దుల ఈశ్వరరెడ్డి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడడమే కాకుండా పీడిత వర్గాల సంక్షేమం కోసం ఉద్యమపో రులోనే ఉంటూ1986 ఆగస్టు 3వ తేదీ ప్రొద్దుటూరు సీపీఐ కార్యాలయంలో తుదిశ్వాస విడిచారన్నారు.  కార్యక్రమంలో ఎద్దుల ఈశ్వరరెడ్డి, గ్రంథాలయ కమిటీ సభ్యులు, సీపీఐ నాయకులు లోకేష్‌, మధు, సంతోష్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-04T04:59:14+05:30 IST