ఫాదర్ ఫెర్రర్కు ఘన నివాళి
ABN , First Publish Date - 2021-06-20T06:43:25+05:30 IST
ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక ఫాదర్ ఆలయంలో ఘన నివాళుల ర్పించారు.
కుందుర్పి, జూన 19: ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక ఫాదర్ ఆలయంలో ఘన నివాళుల ర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో ఆలయంలోని ఫెర్రర్ విగ్రహాన్ని అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఫాద ర్ సేవలను పలువురు వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో ఆలయ కమి టీ సభ్యులు మల్లికార్జున, వైబీ ఓబయ్య, గ్రామ సర్పంచు మారుతేశ్వరి, వైసీపీ మండల కన్వీనర్ సత్యనారాయణశాసి్త్ర పాల్గొన్నారు.
పేదల పెన్నిధి ఫాదర్ ఫెర్రర్: ఉన్నం
కళ్యాణదుర్గం: ఆర్డీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫాదర్ఫెర్రర్ పేదల పెన్నిధి అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి కొనియాడారు. స్థానికంగా శనివారం ఫాదర్ఫెర్రర్ వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఉ న్నం మాట్లాడుతూ ఫాదర్ఫెర్రర్ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కో సం జిల్లాలో ఎనలేని సేవలు చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఓ బుళరాజు, కొల్లాపురప్ప, చల్లాకిషోర్, లింగప్రసాద్, అశోక్ పాల్గొన్నారు.
పామిడి: ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతిని పురస్కరించుకుని శనివా రం స్థానికంగా బంజారా గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయ క్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను కొనియా డారు. కార్యక్రమంలో నాయకులు అంజినాయక్, కిశోర్, రమేష్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.