మూడేళ్ల క్రితం పెళ్లి.. సాకులతో శోభనం వాయిదా.. విసుగొచ్చి భర్త ఫోన్ను చెక్ చేసిన ఆ భార్యకు షాక్..!
ABN , First Publish Date - 2021-07-27T21:26:18+05:30 IST
ఆమె ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్.. మూడేళ్ల క్రితం ఓ బ్యాంక్ ఉద్యోగిని వివాహం చేసుకుంది..
ఆమె ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్.. మూడేళ్ల క్రితం ఓ బ్యాంక్ ఉద్యోగిని వివాహం చేసుకుంది.. అయితే అతను ఆమెను ఎప్పుడూ దగ్గరకు రానివ్వలేదు.. పలు రకాల సాకులు చెప్పి శోభనాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు.. గట్టిగా అడిగితే ఆమె పైనే నిందలు వేశాడు.. విసుగొచ్చి అతడి ఫోన్ను చెక్ చేయగా అసలు విషయం బయటపడింది.. రెండు గే యాప్లలో అతడి ప్రొఫైల్స్ ఉన్నాయి. దీంతో షాలిని విడాకులకు అప్లై చేసింది.
బెంగళూరుకు చెందిన షాలిని 2018లో విక్రమ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత వీరిద్దరూ బెంగళూరులోని జయానగర్లో కాపురం పెట్టారు. అయితే భార్యతో విక్రమ్ సఖ్యతగా ఉండేవాడు కాదు. ఎప్పుడూ ఆమెకు దూరంగానే ఉండేవారు. రకరకాల కారణాలు చెప్పి శోభనాన్ని కూడా వాయిదా వేస్తుండేవాడు. గట్టిగా అడిగితే ఆమె పైనే నిందలు వేసేవాడు. అడిగినంత కట్నం ఇవ్వలేదంటూ ఆమెతో గొడవపడేవాడు. కాగా ఇటీవల విక్రమ్ ఫోన్ను షాలిని చెక్ చేయగా అసలు విషయం బయటపడింది.
రెండు గే (స్వలింగ సంపర్కం) యాప్లలో విక్రమ్ ప్రొఫైల్స్ కనబడ్డాయి. దీంతో షాలిని మహిళా హెల్ప్లైన్ను ఆశ్రయించి విక్రమ్పై చీటింగ్ కేసు పెట్టింది. కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ తర్వాత విక్రమ్ అసలు విషయం అంగీకరించాడు. గే యాప్స్లో తన ఫ్రొఫైల్స్ ఉన్నాయని, అయితే తను ఇప్పటివరకు ఎవరినీ కలవలేదని చెప్పాడు. కాగా, విక్రమ్ నుంచి విడాకులు తీసుకోవాలని షాలిని నిర్ణయించుకుంది.