ఆఫ్ఘన్ మసీదుపై బాంబు దాడి
ABN , First Publish Date - 2021-10-08T21:55:57+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్లోని కుందుజ్ నగరంలో ఓ మసీదుపై శుక్రవారం
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లోని కుందుజ్ నగరంలో ఓ మసీదుపై శుక్రవారం ఉగ్రవాద దాడి జరిగింది. తాలిబన్ ఉన్నతాధికారి ఒకరు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, మసీదు లక్ష్యంగా బాంబు పేలుడు జరిగింది. ఆఫ్ఘన్ ఇంటీరియర్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి కారీ సయ్యద్ ఖోస్టి కూడా ఈ దాడిని ధ్రువీకరించారు. ఇతర వివరాలను వెల్లడించలేదు.
కుందుజ్ నగరంలోని స్థానికుల కథనం ప్రకారం, షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా బాంబు దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు.
ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్లో సిక్కు మైనారిటీల గురుద్వారాపై మంగళవారం తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. సీసీటీవీ కెమెరాలను, ఇతర వస్తువులు, పరికరాలను ధ్వంసం చేశారు. ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ ఇచ్చిన ట్వీట్లో ఈ వివరాలను తెలిపారు.