రాత్రికి రాత్రే ఇంట్లో రూ.12.50 లక్షలు మిస్సింగ్.. ఇంటికి బయట సీసీ కెమెరాలో రికార్డైన వీడియోను చూసి..

ABN , First Publish Date - 2022-04-14T23:06:05+05:30 IST

ఎప్పటిలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి రాత్రి భోజనం చేశారు. ఎవరి గదుల్లోకి వెళ్లి నిద్రపోయారు. తెల్లారి నిద్ర లేచిన తర్వాత ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి అంతా షాకయ్యారు. బీరు తలపులు తెరిచి ఉండ

రాత్రికి రాత్రే ఇంట్లో రూ.12.50 లక్షలు మిస్సింగ్.. ఇంటికి బయట సీసీ కెమెరాలో రికార్డైన వీడియోను చూసి..

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి రాత్రి భోజనం చేశారు. ఎవరి గదుల్లోకి వెళ్లి నిద్రపోయారు. తెల్లారి నిద్ర లేచిన తర్వాత ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి అంతా షాకయ్యారు. బీరు తలపులు తెరిచి ఉండటం.. అందులోని రూ.12.50లక్షలు మాయమవడంతో కంగుతిన్నారు. ఈ క్రమంలోనే ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలు చూసి విస్తుపోయారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ఓ కుటుంబ కొన్నేళ్లుగా పలు వ్యాపారాలు చేస్తోంది. కాగా.. ఎప్పటిలాగే  రాత్రి కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి, అనంతరం ఎవరి గదుల్లోకి వారు వెళ్లి నిద్రపోయారు.  ఈ క్రమంలో ఉదయం ఇంట్లో కనిపించిన సీన్ చూసి వారంతా అవాక్కయ్యారు. బీరువాలో పెట్టిన రూ.12.50లక్షలు రాత్రికి రాత్రే మాయం కావడంతో కంగుతిన్నారు. సరిగ్గా ఇదే సమయంలో అస్సాం నుంచి వచ్చి తమ ఇంట్లో పని చేస్తున్న వ్యక్తి కనిపించకుండా పోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. హుటాహుటిన పోలీసులను ఆశ్రయించారు. విజయ్ రాజ్ మెహతా నుంచి  ఫిర్యాదు స్వీకరించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న సీసీకెమెరాలను పరిశీలించారు. అందులో దృశ్యాలు చూసి ఆ కుటుంబ సభ్యులు షాకయ్యారు. అస్సాం పని వాడే ఈ దొంగతనం చేసినట్టు గుర్తించి విస్తుపోయారు. గత డిసెంబర్‌లోనే అతడు తమ ఇంట్లో పనికి కుదిరినట్టు చెప్పారు. కాగా.. ఆ పని వాడిపై కేసు నమోదు చేసిన అధికారులు.. గాలింపు చర్యలు చేపట్టారు. 




Updated Date - 2022-04-14T23:06:05+05:30 IST