ఇసుక స్టాక్ పాయింట్ను ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2020-09-22T10:45:38+05:30 IST
పట్టణంలో ఇసుక స్టాక్ పాయింట్ను ఏర్పాటు చేయాలని వామపక్ష నాయకులు పాతబస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో దాదాపు గంటసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు గ
వామపక్షాల రాస్తారోకో
స్తంభించిన ట్రాఫిక్
కోడుమూరు, సెప్టెంబరు 21: పట్టణంలో ఇసుక స్టాక్ పాయింట్ను ఏర్పాటు చేయాలని వామపక్ష నాయకులు పాతబస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో దాదాపు గంటసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు గఫూర్మియ్య మాట్లాడుతూ ఇసుక రవాణా లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికుల కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్రతి నిధులకు తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. సీఐ పార్థసారథిరెడ్డి, ఎస్ఐ మల్లికార్జున వామపక్ష నాయకులతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్కు సీఐ ఫోన్ ద్వారా తెలిపారు. త్వరలోనే ఇసుక సమస్యను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని సీఐ తెలపడంతో వారు రాస్తారోకో విరమించారు. కార్యక్ర మంలో సీపీఐ, సీపీఎం నాయకులు రాజు, వీరన్న, క్రిష్ణ పాల్గొన్నారు.