అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ధర్మయుద్ధం : ఈటల
ABN , First Publish Date - 2022-08-19T06:21:44+05:30 IST
మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎ న్నిక కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే ధర్మయుద్ధమని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
మునుగోడురూరల్, ఆగస్టు 18: మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎ న్నిక కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే ధర్మయుద్ధమని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని పలివెల గ్రామంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబపాలనతో రాష్ట్రాన్ని దివాళా చేసిందన్నారు. కే సీఆర్కు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న స్ఫూర్తి ఇప్పుడు లేదని డబ్బు, అహంభావంతో పరిపాలన చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్లో రాజగోపాల్రెడ్డి చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేశా రు. బీజేపీలో చేరుతున్న ఎంపీపీలను, జడ్పీటీసీలను సర్పంచులను టీఆర్ఎస్ బెదిరింపులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఉదాహరణ చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి అని ఆయన గుర్తుచేశారు. టీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజలు అంతమొందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అదేవిఽధంగా వివిధ పార్టీల నేతలు ఈటెల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరారు.