‘ఉక్కు’ ప్రైవేటీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి

ABN , First Publish Date - 2021-05-17T04:27:56+05:30 IST

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా త్వరలో జరిగే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు డిమాండ్‌ చేశారు.

‘ఉక్కు’ ప్రైవేటీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
దీక్షా శిబిరంలో నినాదాలు చేస్తున్న నాయకులు

సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు 

సిరిపురం, మే 16: స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా త్వరలో జరిగే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 45వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమతో పాటు ఉద్యమంలో పాల్గొంటున్నాయన్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చినట్టుగా అసెంబ్లీలో స్టీల్‌ ప్లాంట్‌పై తీర్మానం చేస్తే తమ ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందన్నారు. మహారాష్ట్రలో ఉండే పోస్కో స్టీల్‌ కంపెనీ ఎందుకు ఆక్సిజన్‌ ఇవ్వలేదని, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆక్సిజన్‌ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ, నాయకులు ఎన్‌.కృష్ణ, వరహాలు, రమణ, రాముడు, రాజు, అప్పలరాజు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-17T04:27:56+05:30 IST