ప్రధాన రహదారిపై కొండచిలువ ప్రత్యక్షం
ABN , First Publish Date - 2022-07-04T04:53:48+05:30 IST
ముచ్చుమర్రి ఆర్అండ్ఆర్ సమీపంలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం కొండచిలువ ప్రత్యక్షమైం ది.
కొండాపురం, జూలై 3: ముచ్చుమర్రి ఆర్అండ్ఆర్ సమీపంలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం కొండచిలువ ప్రత్యక్షమైం ది. సుమారు 10అడుగుల పొడవు ఉన్న కొండచిలువను ఈ రహదారిపై వెళ్లే వాహనచోదకులు గమనించారు. దీంతో కొండచిలువను వాహనచోదకులు చంపేశారు. ముచ్చుమర్రి సమీపంలో కొండ లు ఉండడం, గండికోట బ్యాక్ వాటర్ ఉండడంతో విషపురుగులు ఎక్కువని ఆందోళన చెందుతున్నారు.