ఇంటినుంచే క్రికెట్ బెట్టింగ్.. వ్యక్తి అరెస్టు.. రూ.1.23 కోట్లు సీజ్
ABN , First Publish Date - 2020-07-28T01:41:26+05:30 IST
ఇంటినుంచే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా దాదాపు కోటికి పైగా నగదును ...
చండీఘర్: ఇంటినుంచే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా దాదాపు కోటికి పైగా నగదును సీజ్ చేశారు. జలంధర్లోని బీఎస్ఎఫ్ కాలనీలోని నివసిస్తున్న ఓ 39 ఏళ్ల వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా ఇంటి నుంచే బెట్టింగ్ రాకెట్ను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. అతడి నుంచి రూ.1.23 కోట్ల నగదు, ఓ లాప్టాప్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విండీస్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్పై నిందితుడు బెట్టింగులకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.