లారీని ఢీ కొట్టిన ప్రైవేట్‌ బస్సు

ABN , First Publish Date - 2022-07-05T07:22:51+05:30 IST

ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఓ ప్రైవేట్‌ బస్సు ఢీ కొనడంతో బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికుల కు గాయాలు కావడంతో పాటు బస్సు ముందు భాగం దెబ్బతింది.

లారీని ఢీ కొట్టిన ప్రైవేట్‌ బస్సు
లారీని ఢీ కొట్టడంతో ధ్వంసమైన బస్సు ముందు భాగం

నార్కట్‌పల్లి, జూలై 4: ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఓ ప్రైవేట్‌ బస్సు ఢీ కొనడంతో బస్సులో ఉన్న ఇద్దరు  ప్రయాణికుల కు గాయాలు కావడంతో పాటు  బస్సు ముందు భాగం దెబ్బతింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులో సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఎస్‌కేఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓ ప్రైవేటు బస్సు ఏపీ రాష్ట్రం రాజోలు నుంచి హైదరా బాద్‌కు వెళూతూ.. జాతీయ రహదారిపై ఏపీలింగోటం శివారు వద్ద ఉన్న యూఎ్‌సటీపీఎల్‌ కంపెనీ వద్ద ముందు వెళుతున్న లారీని గమనించకుండా అజాగ్రత్తగా బస్సు డ్రైవర్‌ ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బస్సులో 42 మంది ప్రయాణిస్తుండగా ఇద్దరికి  గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌లోని హెడ్‌ కానిస్టేబుల్‌ రమేశ్‌, కానిస్టేబుళ్లు జబ్బార్‌, శ్రీనివా్‌సలు ఘటనా స్థలికి చేరుకుని ప్రయాణికులకు సహాయక చర్యలు అందించారు. మరో బస్సును రప్పించి వారిని పంపించారు. రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు.



Updated Date - 2022-07-05T07:22:51+05:30 IST