దేశ ఔన్నత్యాన్ని చాటిన కవి సమ్మేళనం
ABN , First Publish Date - 2022-08-17T05:41:45+05:30 IST
దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా కవి సమ్మేళనం కార్యక్రమం జరిగిందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
- అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
- 25 మంది కవులకు సత్కారం
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 16: దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా కవి సమ్మేళనం కార్యక్రమం జరిగిందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వ జూ నియర్ కాలేజీ మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన కవి సమ్మేళనానికి అదన పుకలెక్టర్ హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకు న్న సందర్భంగా ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా జాతీయ జెండా, జాతీయగీతం, దేశభక్తి, స్వాతంత్య్రపోరాటం, దేశ గొప్పతనం వంటి అంశాలపై కవి సమ్మేళనం కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 25మంది కవులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నర్సిం హమూర్తి, మాధవి, రంగారెడ్డి, తిరుపతిరావు, రౌఫ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.