వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-30T05:48:58+05:30 IST
మండలంలోని జె.హొసల్లి గ్రామానికి చెందిన శేకన్న (50) ఆత్మహత్య చేసుకున్నాడు.
హాలహర్వి, నవంబరు 29: మండలంలోని జె.హొసల్లి గ్రామానికి చెందిన శేకన్న (50) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్చార్జి హెడ్కానిస్టేబుల్ ఫణిరాజ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేండేళ్ల క్రితం భార్య చనిపోవడం, అనారోగ్యంతో బాధపడుతుండడంతో జీవితంపై విరక్తి చెంది పొలంలో పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్కానిస్టేబుల్ తెలిపారు.