రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మృతిచెందిన నర్సిములు

  • మరొకరికి గాయాలు

నవాబుపేట, ఆగస్టు 8: బైక్‌పై నుంచి పడి ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై భరత్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూర్‌కు చెందిన తోకల నర్సిములు(60), మల్లారెడ్డి ఇద్దరు బైక్‌పై నవాబుపేట వచ్చి తిరిగి సొంతూరు వెళ్తుండగా ఆదివారం రాత్రి ఎల్లకొండలో అదుపుతప్పి పడిపోయారు. నర్సిములు అక్కడికక్కడే మృతిచెందగా మల్లారెడ్డికి గాయాలయ్యాయి. అతడిని వికారాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. నర్సిములు భార్య వసంత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-08-08T05:30:00+05:30 IST