రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-07-02T05:00:24+05:30 IST

బైకుపై వెళ్తుండగా అడవి పంది తగిలి పడి వాహనదారుడు మృతి చెందిన సంఘటన హనుమంతునిపాడు మండలం గాయంవారిపల్లి వద్ద శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. షేక్‌ మాలిక్‌బాషా (37) కందుకూరు నుంచి కనిగిరి హనుమంతునిపాడు మీదుగా కర్నూలుకు బైకుపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో గాయంవారిపల్లి గ్రామం శివారు దాటుతుండగా చెట్లపొదల్లోంచి ఒక్కసారిగా అడవిపంది రోడ్డుపైకి వచ్చి బైకును ఢీకొట్టింది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తలకు బలమైన గాయమై రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న మాలిక్‌బాషా

కనిగిరి (హనుమంతునిపాడు), జూలై 1: బైకుపై వెళ్తుండగా అడవి పంది తగిలి పడి వాహనదారుడు మృతి చెందిన సంఘటన హనుమంతునిపాడు మండలం గాయంవారిపల్లి వద్ద శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. షేక్‌ మాలిక్‌బాషా (37) కందుకూరు నుంచి కనిగిరి హనుమంతునిపాడు మీదుగా కర్నూలుకు బైకుపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో గాయంవారిపల్లి గ్రామం శివారు దాటుతుండగా చెట్లపొదల్లోంచి ఒక్కసారిగా అడవిపంది రోడ్డుపైకి వచ్చి బైకును ఢీకొట్టింది. దీంతో బైకుపై వెళ్తున్న మృతుడు మాలిక్‌బాషా ఎగిరి రోడ్డుపై పడిపోవటంతో తలకు బలమైన గాయమై తీవ్రంగా రక్తస్రావం అయింది. స్థానికులు అక్కడికి చేరుకుని 108కు సమాచారం అందించి, కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావటంతో ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా మాలిక్‌బాషా ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు .


 

Updated Date - 2022-07-02T05:00:24+05:30 IST