రోడ్డుపై జారిపడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-08-08T05:45:58+05:30 IST
రోడ్డుపై జారిపడి గాయాలపాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
రాజాం రూరల్: రోడ్డుపై జారిపడి గాయాలపాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సీఐ కె.రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని గొల్లవీధికి చెందిన నాగల్ల శ్రీనివాస్ శనివారం రాజాంలోని బొబ్బిలి కూడలిలో జారిపడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ని విశాఖ కేజీహెచ్లో చేర్చ గా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందారు. ఈయన మార్కెట్లో ని షాపులకు కూరగాయలు, కిరాణా వస్తువులు సరఫరా చేస్తూ జీవనం సాగించే వారు. ఈ ఘటనపై ఆదివారం రాత్రి కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.