ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టేసరికి పగిలిపోయిన కొత్త రోడ్డు

ABN , First Publish Date - 2021-12-04T20:19:41+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూరులో ఓ కొత్త రోడ్డును బీజేపీ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టేసరికి పగిలిపోయిన కొత్త రోడ్డు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూరులో ఓ కొత్త రోడ్డును బీజేపీ ఎమ్మెల్యే సుచి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఓ కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. ఆమె కొబ్బరికాయ పగలాలనుకున్నారు కానీ దానికి బదులుగా ఆ రోడ్డులోని కంకరరాళ్ళు బయటకు వచ్చాయి. దీంతో ఆమెకు చాలా కోపం వచ్చింది.  అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అక్కడికక్కడే ధర్నా చేశారు. ఇంత నాసిరకంగా రోడ్డును నిర్మిస్తారా? అంటూ నిలదీశారు. 


బిజ్నూరు జిల్లాలోని ఖేద గ్రామం వద్ద నిర్మించిన ఈ రోడ్డు కోసం రూ.1.16 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీని పొడవు దాదాపు 7 కిలోమీటర్లు. సుచి చౌదరి కొబ్బరికాయ కొట్టగానే గ్రావెల్ బయటకు రావడంతో అక్కడే ఉన్న ఆమె భర్త మౌసమ్ ఓ పార తీసుకొచ్చి, చదును చేశారు. 


సాగునీటి పారుదల విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు వికాస్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ రోడ్డు నమూనాను పరీక్షల కోసం పంపించామని చెప్పారు. 


Updated Date - 2021-12-04T20:19:41+05:30 IST