ఢిల్లీ అల్లర్ల కేసులో కొత్త కోణాన్ని వెల్లడించిన క్రైం బ్రాంచ్

ABN , First Publish Date - 2020-06-03T21:16:46+05:30 IST

ఢిల్లీ అల్లర్లు జరుగుతున్న సమయంలో వాటికి ముఖ్య కారకుడైన ఫైసల్ ఫరూక్.. తబ్లీగీ జమాతే చీఫ్ మౌలానా

ఢిల్లీ అల్లర్ల కేసులో కొత్త కోణాన్ని వెల్లడించిన క్రైం బ్రాంచ్

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లు జరుగుతున్న సమయంలో వాటికి ముఖ్య కారకుడైన ఫైసల్ ఫరూక్..  తబ్లీగీ జమాతే చీఫ్ మౌలానా మసూద్‌కు అతి సన్నిహితంగా మెలిగే అబ్దుల్ అలీంతో టచ్‌లో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు. ఇదే విషయాన్ని క్రైం బ్రాంచ్ తన చార్జిషీట్‌లో కూడా స్పష్టంగా పేర్కొని... ఢిల్లీ కోర్టుకు సమర్పించింది.


ఈ అల్లర్లకు సంబంధించి ఫైసల్ పాత్రపై క్రైం బ్రాంచ్ ఇప్పటికే ఆయన ఫోన్ కాల్ లిస్టును క్షుణ్ణంగా పరిశీలించిందని, వాటిని పూర్తిగా అధ్యయనం చేసిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, పింజ్రా టోడ్ గ్రూప్, జామియా కో- ఆర్డినేషన్ కమిటీ, మర్కజ్‌... ఇలా వీటికి సంబంధించిన ముఖ్యులతో ఫైసల్ టచ్‌లో ఉన్నట్లు క్రైం బ్రాంచ్ చేసిన సునిశిత అధ్యయనం తేలింది. 

Updated Date - 2020-06-03T21:16:46+05:30 IST