Chhattisgarh encounter : మావోయిస్టు దళ సభ్యుడు కమలేష్ మృతి
ABN , First Publish Date - 2022-07-02T00:00:54+05:30 IST
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, జిల్లా రిజర్వు గార్డులు
బస్తర్ : ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, జిల్లా రిజర్వు గార్డులు (DRG) మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. గాదిరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, మన్కపల్, బోరపర అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన మావోయిస్టును కమలేష్గా గుర్తించినట్లు చెప్పారు.
బస్తర్ ఐజీ పీ సుందర రాజ్ పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కమలేష్ మంగళగిరి ఏరియా నక్సలైట్ కమిటీ సభ్యుడని తెలుస్తోంది. ఆయన ఆచూకీ తెలిపినవారికి రూ.5 లక్షలు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.