పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-24T05:28:07+05:30 IST

పట్టణంలోని మండాపొలం కాలనీకి చెందిన నాగవళ్లి నాగరాజు(56) శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
నాగరాజు(ఫైల్‌)


టెక్కలి రూరల్‌: పట్టణంలోని మండాపొలం కాలనీకి చెందిన నాగవళ్లి నాగరాజు(56) శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లవీధిలో టైలరింగ్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాగరాజు మండాపొలం కాలనీలో నివా సముంటున్నాడు. శనివారం ఇంట్లో పురుగులమందు సేవిం చి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మార డంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. నాగరాజుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ ఘటనపై టెక్కలి ఎస్‌ఐ కామేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


 

Updated Date - 2021-01-24T05:28:07+05:30 IST