Nellore: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2022-06-17T15:52:26+05:30 IST
జిల్లాలోని మర్రిపాడు మండలం పడమటి నాయుడు పల్లి గ్రామంలో ఎలుగుబంట్లు హల్ చల్ చేస్తున్నాయి.
నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం పడమటి నాయుడు పల్లి గ్రామంలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంట్లు దాడితో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్ల హల్చల్పై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.