కొడుకును కనలేదని భార్యను హాస్పిటల్‌లోనే వదిలేశాడు.. పుత్రుడి కోసం ఎలాంటి పనికి సిద్ధపడ్డాడంటే..

ABN , First Publish Date - 2022-03-09T18:12:35+05:30 IST

అతను కొడుకు కోసం ఎంతగానో కలలు కన్నాడు.. వారసుడి ఉండాలని తీవ్రంగా పరితపించాడు.. అయితే అతనికి ముగ్గురూ కూతుళ్లే పుట్టారు..

కొడుకును కనలేదని భార్యను హాస్పిటల్‌లోనే వదిలేశాడు.. పుత్రుడి కోసం ఎలాంటి పనికి సిద్ధపడ్డాడంటే..

అతను కొడుకు కోసం ఎంతగానో కలలు కన్నాడు.. వారసుడి ఉండాలని తీవ్రంగా పరితపించాడు.. అయితే అతనికి ముగ్గురూ కూతుళ్లే పుట్టారు.. దీంతో అతను తన భార్యను, పిల్లలను హాస్పిటల్‌లోనే వదిలేశాడు.. ఇంటికి రానివ్వలేదు.. కొడుకు కోసం మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పటికే కొడుకును కన్న ఓ మహిళను వివాహం చేసుకోబోతున్నాడు.. దీంతో బాధిత మహిళ కలెక్టర్‌ను ఆశ్రయించింది. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలోని శివ్‌పురికి చెందిన గోలూ జాతవ్ అనే వ్యక్తి 2016లో బసంతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఆ మహిళ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మగపిల్లాడి మీద మోజుతో అతను మూడోసారి ప్రయత్నించాడు. మూడోసారి కూడా ఆమెకు ఆడపిల్లే జన్మించింది. దీంతో అతను వారిని హాస్పిటల్‌లోనే వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు. వారిని ఇంటికి రానివ్వలేదు. దీంతో బసంతి తన ముగ్గురు పిల్లలతో కలిసి పుట్టింటికి చేరింది. కాగా, మగపిల్లాడి కోసం గోలూ మరో వివాహానికి సిద్ధమయ్యాడు. 


ఇప్పటికే మగపిల్లాడు ఉన్న ఓ మహిళను వివాహం చేసుకోబోతున్నాడు. ఆమె భర్త నుంచి విడిపోయి కొడుకుతో కలిసి వేరేగా ఉంటోంది. కేవలం వారసుడి కోసమే ఆమెను పెళ్లి చేసుకునేందుకు గోలూ రెడీ అవుతున్నాడు. ఈ విషయం తెలిసి బసంతి తన భర్తను, అత్తింటి వారిని ఎంతగానో వేడుకుంది. వారు ఆమె మాట వినకపోవడంతో బసంతి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2022-03-09T18:12:35+05:30 IST