Crime: కోడలు కనిపించకపోవడంతో కొడుకుని నిలదీసిన తండ్రి.. అతడు చెప్పింది విని నివ్వెరపోయిన తండ్రి ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-08-03T01:54:57+05:30 IST

ఆ వ్యక్తికి పదేళ్ల క్రితం వివాహమైంది.. ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.. గత నెల 29వ తేదీన భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు.

Crime: కోడలు కనిపించకపోవడంతో కొడుకుని నిలదీసిన తండ్రి.. అతడు చెప్పింది విని నివ్వెరపోయిన తండ్రి ఏం చేశాడంటే..

ఆ వ్యక్తికి పదేళ్ల క్రితం వివాహమైంది.. ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.. గత నెల 29వ తేదీన భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు.. తర్వాతి రోజు ఉదయం చూస్తే ఆ మహిళ కనిపించలేదు.. దీంతో ఆ వ్యక్తి తండ్రికి అనుమానం వచ్చింది.. కోడలు ఎక్కడికి వెళ్లిందని అడిగాడు.. కొడుకు పొంతన లేని సమాధానం చెప్పాడు.. మూడ్రోజులైనా కోడలు కనిపించకపోవడం, కొడుకు పట్టించుకోకపోవడంతో అతడికి గాభరా మొదలైంది.. గట్టిగా నిలదీయడంతో కొడుకు అసలు నిజం చెప్పేశాడు.. దీంతో ఆ వ్యక్తి తన కొడుకుపై హత్య కేసు పెట్టాడు.


ఇది కూడా చదవండి..

Chicken Pakodi: చిచ్చు పెట్టిన చికెన్ పకోడీ.. భార్యపై దాడి చేసిన భర్త.. ఆ తర్వాత అతను ఎంత పని చేశాడంటే..


హర్యానాలోని హసన్‌పూర్‌కు చెందిన శశికాంత్‌కు బీహార్‌కు చెందిన గుడ్డితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. జూలై 29వ తేదీ రాత్రి శశికాంత్, గుడ్డి మధ్య గొడవ జరిగింది. ఆ రాత్రి గుడ్డి ఇంట్లోంచి మాయమైంది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. మూడ్రోజుల తర్వాత తండ్రి గట్టిగా నిలదీయడంతో శశికాంత్ నిజం చెప్పాడు. గొడవ జరిగిన తర్వాత గుడ్డిని విపరీతంగా కొట్టి చంపినట్టు (Husband killed wife) శశికాంత్ చెప్పాడు. మృతదేహాన్ని ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి కట్టెలు పేర్చి, పెట్రోల్ పోసి తగలబెట్టేశానని చెప్పాడు. 


అంతే కాదు భార్య చితాభస్మాన్ని, ఎముకలను తీసుకెళ్లి ఆగ్రాలోని ఓ కాలువలో వేసినట్టు చెప్పాడు. అనంతరం ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లిపోయాడు. కొడుకు చెప్పింది మొత్తం విని నివ్వెరపోయిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు  చేశాడు. కొడుకుపై హత్య కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.  

Updated Date - 2022-08-03T01:54:57+05:30 IST