కోర్టులో కత్తి కలకలం.. అసలేం జరిగిందా అని తీరా తీస్తే..

ABN , First Publish Date - 2022-05-26T16:08:46+05:30 IST

మూడు నెలల క్రితం కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది..

కోర్టులో కత్తి కలకలం.. అసలేం జరిగిందా అని తీరా తీస్తే..

  • యువకుడిని పోలీసులకు అప్పగించిన సెక్యూరిటీ సిబ్బంది


హైదరాబాద్‌ సిటీ/కొత్తపేట : రంగారెడ్డి జిల్లా కోర్టులో ఓ యువకుడు కత్తితో (Knife) రావడం కలకలం సృష్టించింది. తనిఖీల్లో గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. ఇటీవల నగరంలో ప్రేమ (Love), పరువు హత్యలు జరిగిన నేపథ్యంలో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. వనస్థలిపురానికి  చెందిన ఓ యువతి, క్లాస్‌మేట్‌ అక్బర్‌ ప్రేమించుకుని గతేడాది ఆర్యసమాజ్‌లో వివాహం (Marriage) చేసుకున్నారు. తర్వాత కుటుంబ కలహాలతో ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయి. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.


మూడు నెలల క్రితం కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. సోదరిని వేధించడమే కాకుండా విడాకులు ఇవ్వడానికి సిద్ధపడటంతో బాధితురాలి సోదరుడు సాయి కిరణ్‌.. అక్బర్‌పై కోపం పెంచుకున్నట్లు తెలిసింది బుధవారం కోర్టుకు హాజరవుతున్నారని తెలిసి సాయి కిరణ్‌ సైతం కోర్టుకు వచ్చాడు. మిత్రుడితో కలిసి కత్తితో కోర్టులోకి ప్రవేశించాలనుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో కత్తిని గుర్తించి సాయి కిరణ్‌ను పోలీసులకు అప్పగించారు. ఆత్మరక్షణలో భాగంగానే సాయికిరణ్‌ కత్తితో వచ్చి ఉంటాడని అతని సోదరి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-26T16:08:46+05:30 IST