విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-03-08T05:28:16+05:30 IST

మండలంలోని ఎం.చింతకుంట్ల గ్రామానికి చెందిన ఆవుల వెంకటపతి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

గోస్పాడు, మార్చి 7: మండలంలోని ఎం.చింతకుంట్ల గ్రామానికి చెందిన ఆవుల వెంకటపతి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఉన్న నీటి కుంటలో కరెంటు ద్వారా చేపలు పట్టడానికి వెళ్లి పొరపాటున నీటిలోకి దిగడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంకటపతి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-03-08T05:28:16+05:30 IST