Viral Video: ఏందన్నా నువ్వు.. బైక్ అనుకున్నావా.. బొలెరో అనుకున్నావా.. ఒకేసారి అంతమందా !

ABN , First Publish Date - 2022-06-23T02:57:20+05:30 IST

ఇంటర్నెట్ (Internet) అందుబాటులోకి వచ్చాక ఏ విషయం దాగడం లేదు. రొటీన్‌కు భిన్నంగా ఏదైనా కనిపిస్తే ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు క్షణాల్లో..

Viral Video: ఏందన్నా నువ్వు.. బైక్ అనుకున్నావా.. బొలెరో అనుకున్నావా.. ఒకేసారి అంతమందా !

ఇంటర్నెట్ (Internet) అందుబాటులోకి వచ్చాక ఏ విషయం దాగడం లేదు. రొటీన్‌కు భిన్నంగా ఏదైనా కనిపిస్తే ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు క్షణాల్లో వైరల్ (Viral) అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ (Viral Video) అయింది. సహజంగా బైక్‌పై ఎంత మంది ప్రయాణిస్తుంటారు. అదేం ప్రశ్న. బైక్ నడిపే వ్యక్తితో పాటు మరొకరు. రూల్స్‌ను పెద్దగా పట్టించుకోని వాళ్లైతే ముగ్గురు కూడా వెళుతుంటారు అంటారా. కానీ.. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో సదరు వ్యక్తి బైక్‌పై ఏకంగా ఆరుగురిని ఎక్కించుకుని ప్రయాణం చేశాడు. అతనితో కలిపి బైక్‌పై ఏడుగురు ఉన్నారు. బైక్‌పై ఎక్కిన ఆరుగురిలో నలుగురు చిన్నారులే కావడం గమనార్హం. మిగిలిన ఇద్దరూ మహిళలు. ఇంత మందిని ఎక్కించుకుని ప్రయాణం చేసేందుకు అది బైక్ అనుకున్నాడో లేదా బొలెరో అనుకున్నాడో తెలియదు గానీ ఎంతో ప్రమాదకరమైన జర్నీ ఇది. చిన్నారులు, మహిళల ప్రాణాలను రిస్క్‌లో పెట్టి ప్రయాణం చేయడమే ఇది. పొరపాటున బైక్ అదుపు తప్పితే అభంశుభం తెలియని చిన్నారుల గతేం కాను. ఆ ఆడవాళ్ల పరిస్థితి ఏంటనే కనీస ఆలోచన కూడా లేకుండా అంతమందిని బైక్‌పై ఎక్కించుకోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు.



ఆ వ్యక్తి బైక్‌పై ఆరుగురూ ఎక్కుతున్న సమయంలో సమీపంలో ఉన్న వాళ్లు ఎవరో సదరు బైక్ నడిపే వ్యక్తికి తెలియకుండా వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ‘ఇదెక్కడి ఫ్యామిలీ ట్రిప్ అన్న’ అని నోరెళ్లబెట్టారు. వీడియో చూసిన మరో నెటిజన్ ‘It’s Not Safe’ అని ట్వీట్ చేశాడు. ఇంకో నెటిజన్ ‘Is that for Real ?’ అని విస్మయం వ్యక్తం చేశాడు. ఎంత పెట్రోల్ ధరలు పెరిగినా ఇలా ఒకేసారి ఇంతమందిని బైక్‌పై ఎక్కించుకుని ప్రయాణం చేయడం ప్రమాదకరమని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక్కసారి మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - 2022-06-23T02:57:20+05:30 IST