పదిహేడేళ్ల యువతితో ప్రేమలో పడిన ఇద్దరు పిల్లల తండ్రి.. ఆమె వేరే వ్యక్తితో ఫొటో దిగిందని ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-04-19T17:44:35+05:30 IST

అతను వివాహితుడు.. ఇద్దరు పిల్లలకు తండ్రి.. 34 ఏళ్ల వయసు కలిగిన ఆ వ్యక్తి తన వయసులో సగం ఉన్న 17 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

పదిహేడేళ్ల యువతితో ప్రేమలో పడిన ఇద్దరు పిల్లల తండ్రి.. ఆమె వేరే వ్యక్తితో ఫొటో దిగిందని ఎంత పని చేశాడంటే..

అతను వివాహితుడు.. ఇద్దరు పిల్లలకు తండ్రి.. 34 ఏళ్ల వయసు కలిగిన ఆ వ్యక్తి తన వయసులో సగం ఉన్న 17 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.. అన్ని విషయాలూ తెలిసిన ఆ యువతి కూడా అతడిని ప్రేమించింది.. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నారు.. తాజాగా ఇద్దరూ గ్రామంలోని ఓ వివాహానికి హాజరయ్యారు.. ఆ పెళ్లిలో యువతి ఒక వ్యక్తితో ఫొటో దిగింది.. అది చూసి ఆమె ప్రియుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.. ఆ యువతిని తుపాకీతో కాల్చాడు.. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు. 


మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా ఇనాయత్‌పూర్ గ్రామానికి చెందిన రామ్‌జీ యాదవ్‌కు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన వయసులో సగం వయసున్న అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇటీవల ఇద్దరూ ఓ వివాహానికి హాజరయ్యారు. ఆ వేడుకలో యువతి ఇతరులతో ఫొటోలు దిగడం రామ్‌జీ యాదవ్‌కు నచ్చలేదు. అదే విషయమై ఆమెతో గొడవపడ్డాడు. వివాహ కార్యక్రమం తర్వాత తన ప్రేయసిని, ఆమె తమ్ముడిని బైక్‌పై ఎక్కించుకుని గ్రామ శివార్లకు తీసుకెళ్లాడు. 


ఇతర వ్యక్తులతో ఎందుకు ఫోటోలు తీసుకున్నావని ప్రేయసిని అడిగాడు. ఫొటో దిగిన వ్యక్తి తన మేనమామ అని బాలిక చెప్పింది. అయినా రామ్‌జీ సంతృప్తి చెందకుండా ఆ బాలికను చెప్పుతో కొట్టాడు. దీంతో ఆమె నేలపై కూర్చొని ఏడవడం ప్రారంభించింది. అనంతరం రామ్‌జీ పిస్టల్‌ను బయటకు తీసి ప్రియురాలిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ బాలిక వీపునకు తగిలింది. అనంతరం రామ్‌జీ తన నుదిటిపై తుపాకీతో కాల్చుకున్నాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బాలిక ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-04-19T17:44:35+05:30 IST