వివాహిత అదృశ్యం

ABN , First Publish Date - 2021-04-17T05:50:03+05:30 IST

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.

వివాహిత అదృశ్యం

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 16: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వెలిచేరు శివారు యూజీ పాలేనికి చెందిన 26 ఏళ్ల మహిళ ఈనెల 13వ తేదీ రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2021-04-17T05:50:03+05:30 IST