జాతీయ రహదారిపై భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-14T05:09:40+05:30 IST

భారత దేశ 75వ స్వాతంత్య్ర వేడుకల నేపఽథ్యంలో శనివారం మాధవధార ఆర్‌అండ్‌బీ జంక్షన్‌ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు.

జాతీయ రహదారిపై భారీ ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఎంవీవీ, కేకే రాజు, కార్పొరేటర్లు, ఇతర నాయకులు

మాధవధార/అక్కయ్యపాలెం, ఆగస్టు 13 :  భారత దేశ 75వ స్వాతంత్య్ర వేడుకల నేపఽథ్యంలో శనివారం మాధవధార ఆర్‌అండ్‌బీ జంక్షన్‌ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు అధ్వర్యంలో జరిగిన ర్యాలీలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్లు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 75 అడుగుల జెండాతో ర్యాలీని తాటిచెట్లపాలెం హైవే మీదుగా గురుద్వారా జంక్షన్‌ వరకు నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి భారతీయుడు 75 ఏళ్ల స్వాత్రంత్య్ర వజ్రోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.


Updated Date - 2022-08-14T05:09:40+05:30 IST