కొవిడ్‌పై ఇంటింటి సర్వేను చేపట్టాలి

ABN , First Publish Date - 2021-05-06T07:38:48+05:30 IST

గ్రామాల్లో కొవిడ్‌పై ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే అన్నారు.

కొవిడ్‌పై ఇంటింటి సర్వేను చేపట్టాలి
గంజాల్‌లో వివరాలు తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌

సోన్‌, మే 5 : గ్రామాల్లో కొవిడ్‌పై ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే అన్నారు. బుధవారం మండలంలోని గంజాల్‌ గ్రామంలో కొవిడ్‌పై నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించి వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటింటా అనారోగ్యం తో ఉన్న వారిని గుర్తించి వివరాలు సేకరించి సంబంధిత ఆరోగ్యకేంద్రాల్లో అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నివారణ టీకాలు తీసుకునే విధంగా చూడాలన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ సందుగారి లావణ్య, ఎంపీవో అశోక్‌, కార్యదర్శి సృజిత్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-05-06T07:38:48+05:30 IST