తిరుమల ఘాట్లో ఏనుగుల గుంపు
ABN , First Publish Date - 2020-06-06T09:49:36+05:30 IST
తిరుమల మొదటి ఘాట్రోడ్డులో ఓ ఏనుగుల గుంపు కనిపించడంతో కలకలం రేగింది. లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారిన ఘాట్రోడ్లపై అడవి జం తువులు తిరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం దాదాపు 5 ఏనుగులు ఏడో మైలు వద్ద రోడ్డుపై
తిరుపతి: తిరుమల మొదటి ఘాట్రోడ్డులో ఓ ఏనుగుల గుంపు కనిపించడంతో కలకలం రేగింది. లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారిన ఘాట్రోడ్లపై అడవి జం తువులు తిరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం దాదాపు 5 ఏనుగులు ఏడో మైలు వద్ద రోడ్డుపై నిలబడ్డాయి. తిరుమలలో విధులు ముగించుకుని వెనుదిరిగిన కొందరు ఉద్యోగులు, కార్మికులు ఈ ఏనుగుల గుంపును చూసి దూరంగా నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత అవి అడవిలోకి వెళ్లిపోయాయి.