షాకింగ్: సామాజ శ్రేయస్సు కోసమే కరోనా బారిన పడ్డానన్న మేయర్
ABN , First Publish Date - 2020-04-05T02:47:23+05:30 IST
ఆయన పేరు స్టిఫాన్ వాన్ డస్సెల్. బెర్లిన్ డిస్ట్రిక్ మేయర్గా సేవలందిస్తున్నారు. కాగా.. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వైరల్గా మారింది. కావాలనే కరోనా వైరస్ బారిన పడ్డానని ఇంటర్వ్యూలో ఆయన ప్రకటించడం స్థానికంగా పెను సంచలనానికి దారి తీసింది.
బెర్లిన్(జర్మనీ): ఆయన పేరు స్టిఫాన్ వాన్ డస్సెల్. బెర్లిన్ డిస్ట్రిక్ మేయర్గా సేవలందిస్తున్నారు. అయితే.. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వైరల్గా మారింది. కావాలనే కరోనా వైరస్ బారిన పడ్డానని ఇంటర్వ్యూలో ఆయన ప్రకటించడం స్థానికంగా పెను సంచలనానికి దారి తీసింది. వాస్తవానికి ఆయన సహచరికి కరోనా సోకింది. ఆమె ప్రస్తుతం తమ ఇంట్లో క్వారంటైన్లో ఉంది. అయితే..కరోనా బారిన పడ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆయన..వాటిని పక్కనపెట్టారు. దీంతో వాన్కు కరోనా సోకింది. అయితే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. ఓసారి తాను కరోనా బారినపడి కోలుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి రెండో సారి కరోనా బారినపడనని భావించినట్టు తెలిపారు. ఆ తరువాత ఇక ఎన్నడూ తన ద్వారా ఇతరులకు కరోనా సోకదని ఆయన చెప్పుకొచ్చారు. తాను సామాజ శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.