జనవాణికి వినతుల వెల్లువ : పోతిన వెంకట మహేష్
ABN , First Publish Date - 2022-07-11T22:10:47+05:30 IST
విజయవాడ: విజయవాడలో తమ పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయని జనసేన పార్టీ నాయకుడు పోతిన వెంకట మహేష్ తెలిపారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనసేన
విజయవాడ: విజయవాడలో తమ పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయని జనసేన పార్టీ నాయకుడు పోతిన వెంకట మహేష్ తెలిపారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు వినతులు ఇచ్చేందుకు జనం తరలివచ్చారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతోనే బాధితులు వాటిని పవన్ దృష్టికి తీచ్చారని పేర్కొన్నారు. జగన్ వైసీపీ ప్లీనరీ పేరిట అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.