జగములేలే తల్లికి భక్త నీరాజనం

ABN , First Publish Date - 2022-09-28T05:52:15+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉ త్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు, విశేషపూజలు నిర్వహించారు.

జగములేలే తల్లికి భక్త నీరాజనం
హిందూపురంలో రాజరాజేశ్వరి దేవిగా కొల్హాపురమ్మ

హిందూపురం అర్బన, సెప్టెంబరు 27: దసరా శరన్నవరాత్రి ఉ త్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు, విశేషపూజలు నిర్వహించారు. తెల్లవారు జా ము నుంచే అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం వివిధ అలంకారాల్లో దేవతామూర్తులను కొలువుదీర్చారు. పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయంలో తమలపాకులతో బన్సారి అమ్మనగా అ మ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కొల్హాపురి మ్రహాలక్ష్మీ అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా, నింకంపల్లి రోడ్డు యల్లమ్మదేవి ఆలయంలో కొబ్బరిపొడితో ప్రత్యంగిరి దేవిగా అలంకరించారు. శ్రీకంఠాపురం పులమతి సడ్లపల్లి రోడ్డులోని రాజరాజేశ్వరీ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సాధుచెట్టి సంఘం ఆధ్వర్యంలో జలదుర్గమ్మ  ఆలయంలో గుండుమొగ్గలు, కనకాంబరాల పూలతో గౌరీదేవిగా, ముద్దిరెడ్డిపల్లి విజయనగర్‌ కాలనీ గాయత్రి మాతను చౌడేశ్వరీదేవిగా, బెంగళూ రు రోడ్డు రేణుకా యల్లమ్మను గౌరీ దేవిగా, శ్రీకంఠాపురంలో దుర్గామాతగా, మోడల్‌కాలనీలో బెస్త సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ దేవతను బాలాత్రిపుర సుందరిగా, మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న సుబ్రహ్మ ణ్యేశ్వర ఆలయంలో లలితా దేవిగా అలంకృతులను చేసి భక్తులకు దర్శ నం కల్పించారు. ఆలయాల వద్ద భక్తుల కోలాహలం నెలకుంది.


లేపాక్షి: స్థానిక దుర్గావీరభద్రేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు గాయత్రిదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, విశేష పూజలు, నీరాజనం పూజలు చేశారు. మూ డోరోజు బుధవారం అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అలంకరణలో దర్శనమివ్వనున్నట్లు అర్చకులు తెలిపారు.

 

పెనుకొండ: స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారిని తమలపాకు ఆలంకరణలో, వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని ధనలక్ష్మీ (కరెన్సీనోట్లు) అలంకరణలో ముస్తాబు చేసినట్లు అర్చకులు రమే్‌షస్వామి, గిరిస్వామి తెలిపారు. 


మడకశిర రూరల్‌: మండలంలోని కల్లుమర్రి వీరకేతమ్మ, నీలకంఠాపురంలో పార్వతిదేవి, ఆమిదాలగొంది కనుమ మారెమ్మ ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక ఆలంకరణల్లో దర్శనమిచ్చారు. 


అమరాపురం: మండలకేంద్రంలోని చోళమాంబదేవి, కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. సాయం త్రం అమ్మవార్లను వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.  రాత్రి సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


రొళ్ల: మండలంలోని జీరిగేపల్లిలో వెలిసిన అమ్మాజీ దేవతను ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. రత్నగిరిలో అలంకృతులైన కొల్లాపురి మ హాలక్ష్మీదేవి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూకట్టారు.

 

గోరంట్ల: పట్టణంలోని వాసవీమాతను హరితకన్యకగా, చౌడేశ్వరీ ఆ లయంలో అమ్మవారు శాకాంబరీదేవిగా, గుమ్మయ్యగారిపల్లి మారెమ్మ ను మహాలక్ష్మీగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. 


సోమందేపల్లి: స్థానికంగా వాసవీమాతను మధురమీనాక్షి అలంకరణలో, చౌడేశ్వరీదేవి, అంబాభవానీ, పెద్దమ్మ ఆలయాల్లో ప్రత్యేక  అలం కరణలు, పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాల్లో అమ్మవార్ల దర్శ నానికి భక్తజనం పోటెత్తారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు కొనసా గాయి. ఊరూరా నవరాత్రి శోభ ఇనుమడించింది.

Updated Date - 2022-09-28T05:52:15+05:30 IST