4 గంటలు గడిచినా రాని ఆంబులెన్స్.. రోడ్డుపైనే కరోనా బాధితుడి మృతి

ABN , First Publish Date - 2020-07-04T03:34:21+05:30 IST

నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో...

4 గంటలు గడిచినా రాని ఆంబులెన్స్.. రోడ్డుపైనే కరోనా బాధితుడి మృతి

బెంగళూరు: నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు బాధితుడు. విషయం తెలిసిన వెంటనే ఆంబులెన్స్‌ పంపించాల్సిన అధికారులు దీనిని ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూనే ఆంబులెన్స్ కోసం ఎదురుచూశాడా బాధితుడు. 4 గంటల పాటు నడిరోడ్డుపైనే మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయాడు. ఆంబులెన్స్ అందకపోవడంతో కరోనా బాధితుడు మరణించాడనే విషయం తెలుసుకున్న అధికారులు దిద్దుబాటు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ సంఘటనపై బృహత్ బెంగళూరు మహానగర పాలికే కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఘటనపై విచారణకు ఆదేశించానని, దీనికి కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-07-04T03:34:21+05:30 IST