రుయాలో సిద్ధమవుతున్న కొవిడ్ కేంద్రం
ABN , First Publish Date - 2022-07-01T07:18:37+05:30 IST
రుయాస్పత్రిలో 120 పడకలతో కొవిడ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ భారతి గురువారం తెలిపారు.
తిరుపతి సిటీ, జూన్ 30: రోజు రోజుకూ పెరుగుతున్న కొవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకొని రుయాస్పత్రిలో 120 పడకలతో కొవిడ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ భారతి గురువారం తెలిపారు. పాత మెడిసిన్ సర్జరీ భవనంలో కొవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 40 ఆక్సిజన్ పడకలను, మరో 80 సాధారణ పడకలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. అలాగే అవసరమైన వైద్య సిబ్బంది, మందులు ఉన్నాయన్నారు. కొవిడ్ పరీక్షలు కూడా నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. నాల్గవ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.