మాదిగలకు కార్పొరేషన ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-05-23T06:05:58+05:30 IST

తెలంగాణ రా ష్ట్రంలో 12శాతం జనా భా కలిగిన మాదిగల కు ప్రత్యేక కార్పొరేషన ఏర్పాటు చేయాలని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్య వస్థాపక అధ్యక్షుడు జన్ను కనకరాజు డి మాండ్‌ చేశారు.

మాదిగలకు కార్పొరేషన ఏర్పాటు చేయాలి
నినాదాలు చేస్తున్న నాయకులు

మాదిగ హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షుడు కనకరాజు 

దేవరకొండ, మే 22: తెలంగాణ రా ష్ట్రంలో 12శాతం జనా భా కలిగిన మాదిగల కు ప్రత్యేక కార్పొరేషన ఏర్పాటు చేయాలని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్య వస్థాపక అధ్యక్షుడు జన్ను కనకరాజు డి మాండ్‌ చేశారు.  ఆదివారం మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో దేవరకొండలో బస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బంజారాభవనలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీలకు ప్రత్యేకంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను  కేటాయించాలని అన్నారు. ఎస్సీ, ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన ఏ ర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. పారిశుధ్య కార్మికులను పర్మినెంట్‌ చే యాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేయాలని డిమాండ్‌ చేశా రు. డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని తెలిపా రు. సమావేశంలో మాదిగ హక్కుల దండోరా జిల్లా కో ఆర్డినేటర్‌ ఎర్ర ఆంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్‌, జాతీయ అధ్యక్షుడు వేముల బలరాం, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పందుల సాయునాధ్‌, మొండికత్తి లింగయ్య, నాయకులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-05-23T06:05:58+05:30 IST